కొత్త వెర్షన్ (49) తో 'గూగుల్ క్రోమ్...
- March 03, 2016
విండోస్, ఓఎస్ ఎక్స్, లైనక్స్ యూజర్లకు 'గూగుల్ క్రోమ్' ఇంటర్నెట్ బ్రౌజర్ కొత్త వెర్షన్ (49) నూతన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఇప్పుడు ఆయా ప్లాట్ఫాంల వినియోగదారులు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త వెర్షన్లో వెబ్ పేజీలను స్మూత్గా స్క్రోల్ చేసుకునేందుకు వీలుంది. దీంతోపాటు దాదాపు 26కు పైగా సెక్యూరిటీ ఫిక్స్లను ఇందులో అందిస్తున్నారు. అదేవిధంగా ఇంటర్నెట్ స్పీడ్ను బట్టి నెట్ వినియోగదారులకు లైట్ వెర్షన్ వెబ్ పేజీలను అందించేందుకు వీలుగా వెబ్సైట్ల యజమానులకు కొత్త రకం సాఫ్ట్వేర్ ఏపీఐలను అందుబాటులోకి తెచ్చారు. వీటి ద్వారా ఆయా సైట్లలో ఉండే ఆడియో, వీడియో, ఫ్లాష్ తదితర ఫైల్స్ను ఓపెన్ చేయకుండా కేవలం బేసిక్ వెబ్ పేజీని మాత్రమే ఓపెన్ చేసేందుకు వీలుంటుంది.ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్న పీసీ యూజర్లకు క్రోమ్కు చెందిన ఈ కొత్త వెర్షన్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని గూగుల్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వెర్షన్ కేవలం పీసీ యూజర్లకు మాత్రమే లభిస్తుండగా త్వరలోనే అప్డేటెడ్ క్రోమ్ బ్రౌజర్ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







