ఢిల్లీ లో దారుణం..ఆక్సిజన్ కొరత..20 మంది మృతి
- April 24, 2021
ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభణ భారీగా ఉన్నది. పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్నది. కొరతను తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కొరత తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రత అధికంగా ఉన్నది. ఢిల్లీలోని గోల్డెన్ జైపూర్ ఆసుపత్రిలో సరైన సమయానికి ఆక్సిజన్ అందక పోవడంతో 20 మంది రోగులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం సాయంత్రానికి 3600 లీటర్ల ఆక్సిజన్ చేరాల్సి ఉంటె,అర్ధరాత్రి 1500 లీటర్ల ఆక్సిజన్ సరఫరా అయ్యింది. ఏడు గంటల ఆలస్యంగా ఆక్సిజన్ చేరడంతో 20 మంది రోగులు మృతి చెందారు. అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కూడా ఎక్కువ సమయం రాదని, ప్రస్తుతం 200 మంది రోగులు ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతున్నారని, ఆక్సిజన్ అందకుంటే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









