భారత్ సెకండ్ వేవ్..ఆందోళన చెందిన ఆంటోనీ ఫౌచీ
- April 24, 2021
వాషింగ్టన్: కరోనా వైరస్ విషయంలో భారత్ ప్రస్తుతం అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటోందని అమెరికా వైద్య విభాగం ఉన్నత సలహాదారు ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్కు తాము ఏవిధంగానైనా సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
'భారత్ ప్రస్తుతం అత్యంత భయంకర పరిస్థితులు ఎదుర్కొంటోంది. భారత్కు ఏవిధంగానైనా సాయం చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. నిన్న ఆ దేశంలో ఇప్పటివరకూ ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. భారత్లో క్లిష్ట పరిస్థితుల పరిష్కారానికి అమెరికాకు చెందిన సీడీసీ అక్కడి సంబంధిత విభాగంతో కలిసి సాంకేతికంగా సహకారం, సహాయాన్ని అందించేందుకు పనిచేస్తోంది. ఆ దేశంలో కొత్త వేరియంట్లు విజృంభిస్తున్నాయి. వాటిపై వ్యాక్సిన్లు ఎంతమేర ప్రభావం చూపిస్తాయనేది చెప్పలేం. కానీ ప్రజలందరికీ టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది' అని ఫౌచీ తెలిపారు.
కాగా, భారత్లో గడిచిన 24 గంటల్లో 3,46,786 కేసులు నమోదయ్యాయి. మరో 2,624 మంది మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు వదిలారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









