Dh4,300 దోపిడి కేసులో ఆసియా వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
- April 25, 2021
దుబాయ్: దుబాయ్ లో ఓ ఉద్యోగిపై దాడి చేసి అతని నుంచి Dh4,300 మేర దోచుకున్నారనే ఆరోపణలతో అరెస్టైన ఆసియా వ్యక్తి కోర్టు విచారణలో ఊరట లభించింది.వాదోపవాదాలు విన్న తర్వాత ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది.ఈ కేసు గత జనవరిలో పోలీసుల దృష్టికి వచ్చింది. బాధితుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఒకే ఇరుగు పొరుగు వారే. అయితే...చెత్త వేయటం విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు విచారణలో తేలింది. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం..ఆసియా వ్యక్తి తనకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాలని కోరాడని, దీంతో తాను నిందితుడి ఇంటికి వెళ్లాలని..అప్పటికే అక్కడ ఉన్న ఐదుగురు ఆసియా వ్యక్తులు తనపై దాడి చేసి పారిపోయారని వివరించారు. ఆ తర్వాత చూసుకుంటే తన దగ్గర ఉన్న Dh4,300 డబ్బులు కనిపించలేదని, దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. అయితే..ఆ సొమ్మను ఆసియా వ్యక్తి తీశాడని కోర్టు ముందు రుజువు కాలేదు. దీంతో చోరీ కేసులో ఆసియా వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది కోర్టు.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం