సీట్ బెల్ట్ పెట్టకపోవడం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడటంపై కెమెరాలతో నిఘా
- April 26, 2021
దోహా: మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి ఉల్లంఘనల్ని కెమెరాలతో గుర్తించి, చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కల్నల్ మొహమ్మద్ రాది అల్ హజ్రి మాట్లాడుతూ, సీటు బెల్టు పెట్టకోకపోవడం అలాగే మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు. రోడ్లపై పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో తలా ప్రాజెక్ట కింద కెమెరాలను ఏర్పాటు చేసి, ఉల్లంఘనల్ని గుర్తిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు పోకుండా వుండటమే తమ లక్స్యమని ఆయన వివరించారు. గడచిన పదేళ్ళలో మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కాగా, స్పీడ్ లిమిట్ ఉల్లంఘనులకు 500 నుంచి 1000 ఖతారీ రియాల్స్ వరకు జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







