హోటళ్ళలో ఆక్యుపెన్సీ పెరుగుదల: క్వారంటైన్ ఎఫెక్ట్
- May 04, 2021దోహా: తప్పనిసరి హోటల్ క్వారంటైన్ నేపథ్యంలో హోటళ్ళలో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో ట్రావెల్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2020 నాలుగో త్రైమాసికంలో 49 శాతం ఆక్యుపెన్సీ నమోదయ్యింది. యావరేజ్ డెయిలీ రేట్లు.. ఒక రూమ్ కోసం 537 ఖతారీ రియాల్స్ అలాగే, అందుబాటులో వున్న రూము రెవెన్యూ 263 ఖతారీ రియాల్స్ నమోదైంది. ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు తప్పనిసరి హోటల్ క్వారంటైన్ నిబంధన విధించిన దరిమిలా హోటళ్ళలో రూములు నిండుతున్నాయి. 10 రోజుల క్వారంటైన్ విధిస్తున్నారు ప్రయాణీకులకి. కాగా, ల్యాడ్ ట్రాన్సాక్షన్ టికెట్ రేటు అత్యధికంగా అల్ మషాఫ్ ప్రాంతంలో 70 మిలియన్ ఖతారీ రియాల్స్ నమోదయ్యింది. అల్ వుకైర్ - వక్రా మునిసిపాలిటీలో ల్యాండ్ ట్రాన్సాక్షన్ చదరపు అడుగుకి 200 నుంచి 250 ఖతారీ రియాల్స్ ధర పలుకుతోంది. దోహా పరిసరాల్లోని కొన్ని మునిసిపాలిటీల్లో చదరపు అడుగుకి 140 ఖతారీ రియాల్స్ 300 ఖతారీ రియాల్స్ వరకు ధర పలుకుతోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ