సల్మానియాలో ఇంటిగ్రేటెడ్ యూనిట్ ద్వారా కోవిడ్ 19పై పోరాటం

- May 05, 2021 , by Maagulf
సల్మానియాలో ఇంటిగ్రేటెడ్ యూనిట్ ద్వారా కోవిడ్ 19పై పోరాటం

మనామా: సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ ఛైర్మన్ అలాగే నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ - కరోనా వైరస్, లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, కోవిడ్ 19 బాధితులకు ఇంటిగ్రేటెడ్ వైద్య చికిత్స అందించే ప్రత్యేక యూనిట్, సల్మానియా మెడికల్ కాంప్లెక్సులో ప్రారంభించారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అలాగే ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సహాయ సహకారాలతో మెరుగైన వైద్య సౌకర్యాల్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐసోలేషన్, చికిత్స వంటి అంశాలకు సంబంధించి మెరుగైన సౌకర్యాలు ఇక్కడ పొందుపరిచారు. ప్రస్తుతం 59 శాతం ఆక్యుపెన్సీ వుందనీ, పరిస్థితి అదుపులోనే వుందని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com