వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకు పిసిఆర్ టెస్ట్ అవసరం లేదు
- May 07, 2021
బహ్రెయిన్: కోవిడ్ - 19 నేషనల్ మెడికల్ టీమ్, ఈద్ అల్ ఫితర్ తొలి రోజు నుంచి ఎవరైతే ప్రయాణీకులుంటారో, అలాంటివారిలో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వున్నవారికి పీసీఆర్ టెస్ట్ అవసరం లేదని స్పష్టంచేసింది. అయితే, పూర్తి వ్యాక్సినేషన్.. అంటే రెండు డోసుల్నీ ఆయా ప్రయాణీకులు తీసుకుని, నిబంధనలకు అనుగుణంగా వ్యాక్సినేషన్ తర్వాత తగిన సమయాన్ని వారు పూర్తి చేసి వుండాలి. దేశంలోకి వచ్చే ప్రయాణీకులు తమ వెంట వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా, కరోనా నుంచి కోలుకున్నదానికి సంబంధించిన సర్టిఫికెట్ సమర్పించాల్సి వుంటుంది. జిసిసి మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా వీటిని సమర్పించవచ్చు. యూకే, ఈయూ, అమెరికా, కెనడా వంటి దేశాల్లో వ్యాక్సినేషన్ పొందినవారికి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. వాటిని సమర్పించాల్సి వుంటుంది. ఆ సర్టిఫికెట్ లేనివారు పిసిఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలి. అలాగే వారికి ప్రత్యేకంగా కరోనా టెస్టులు వచ్చిన తర్వాత నిర్వహిస్తారు. ఐసోలేషన్ తప్పనిసరి. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల నుంచి వచ్చే ట్రాన్సిట్ ప్రయాణీకులు పిసిఆర్ నెగెటివ్ టెస్ట్ తెచ్చుకోవాలి. అదీ ప్రయాణానికి 48 గంటల ముందు చేయించుకున్న పరీక్ష ఫలితం అవ్వాలి.
తాజా వార్తలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!









