ప్రత్యేక దర్శనం పై టీటీడీ కీలక నిర్ణయం

- May 12, 2021 , by Maagulf
ప్రత్యేక దర్శనం పై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల: కరోనా భయంతో భక్తులు తిరుమల వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న వేళ టీటీడీ వెసులుబాటు కల్పించింది.రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు పొందిన భక్తులకు దర్శనం తేదీని మార్చుకునే అవకాశం ఇచ్చింది.మే 31 వరకు టికెట్లు పొందిన వారు తేదీ మార్చుకోవచ్చని, ఏడాదిలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చని సూచించింది.లాక్ డౌన్, కర్ఫ్యూతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పడిపోయింది.రోజుకు 15వేల టికెట్లు అందుబాటులో ఉన్నా స్వామివారి దర్శనానికి 3వేలలోపే వస్తుండటంతో ఈ మార్పు చేసింది.కాగా మంగళవారం 2,262 మంది భక్తులే స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. 925 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com