భార‌త్‌లో కోవిడ్…WHO ఆందోళ‌న‌

- May 15, 2021 , by Maagulf
భార‌త్‌లో కోవిడ్…WHO ఆందోళ‌న‌

జెనీవా: భారత్ లో కాస్త పాజిటివ్ కేసులు త‌గ్గినా.. రిక‌వ‌రీ కేసులు పెరిగినా.. క‌రోనా విల‌యం మాత్రం కొన‌సాగుతూనే ఉంది.సెకండ్ వేవ్‌లో ఇవాళ కూడా 3 ల‌క్ష‌ల‌కు పైగా కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.అయితే, భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO).భార‌త్‌లోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఆందోళ‌న‌ర రీతిలో పెరుగుతున్నాయ‌ని.. ఆస్ప‌త్రుల‌పాల‌య్యేవారి సంఖ్య కూడా పెరిగిపోయింద‌ని. కోవిడ్ బారిన‌ప‌డి మృతిచెందేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు WHO చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియేసిస్.. ఇదే స‌మ‌యంలో.. క‌రోనా సోకిన మొద‌టి సంవ‌త్స‌రం కంటే.. రెండో సంవ‌త్స‌రంలో మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంద‌ని, మ‌ర‌ణాలు ఎక్కువ సంఖ్య‌లో న‌మోదు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయంటూ ప్ర‌పంచ దేశాల‌ను హెచ్చ‌రించారు టెడ్రోస్.మ‌రోవైపు.. భారత్ లో క‌రోనా ఉధృతిని అడ్డుకోవ‌డానికి WHO పూర్తిస్థాయిలో స‌హ‌క‌రిస్తోంద‌ని.. ఇప్ప‌టికే వేల సంఖ్య‌లో ఆక్సిజ‌న్ కాన్‌సెంట్రేట‌ర్స్‌ను స‌ర‌ఫ‌రా చేశామ‌ని.. మొబైల్ హాస్పిట‌ళ్ల‌కు టెంట్లు, మాస్క్‌లు, మెడిక‌ల్ సామాగ్రిని కూడా స‌మ‌కూర్చిన‌ట్టు వెల్ల‌డించారు.ఇక‌, భార‌త్‌కు WHO పంపించిన ఆక్సిజ‌న్ కాన్‌సెంట్రేట‌ర్స్‌, మందులు, మాస్క్‌ల‌కు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com