అప్పటి నుంచి డీఆర్డీవో 2డీజీ డ్రగ్ లభ్యం
- May 15, 2021
కరోనాకు చెక్ పెట్టేందుకు క్రమంగా కొత్త వ్యాక్సిన్లు,మందులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.ఇప్పటికే భారత రక్షణ సంస్థ డీఆర్డీవో భాగస్వామ్యంతో కోవిడ్ బాధితుల చికిత్స కోసం 2డీజీ డ్రగ్ ను తయారు చేయగా.. తాజాగా.. 2డీజీ డ్రగ్ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది.పౌడర్ రూపంలో ఉండే సాచెట్ను విడుదల చేసింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్.. 10,000 మోతాదుల మొదటి బ్యాచ్ను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక, 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఉత్పత్తి… హైదరాబాద్ సహా పలు కేంద్రాల్లో త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి.డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్డీవోకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ఈ మందును అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే కాగా.. 2-డీజీ ఔషధ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి కూడా లభించింది.

ఈ మందు కనుక అనుకున్న విధంగా పని చేస్తే, కరోనా వైరస్ చిన్న జలుబుకంటే చిన్న జబ్బుగా మారిపోతుంది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్సులో (మందు పరీక్షలో)ఇది అధ్బుతంగా పని చేసింది.కరోనాపై భారత్ చేస్తున్న పోరాటంలో ఈ 2-డీజీ డ్రగ్ కూడా కీలక భూమికి పోషించనుంది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









