యూఏఈ: ఎల్పీజీ సిలిండర్లకు కొత్త మార్గదర్శకాలు జారీ

- May 15, 2021 , by Maagulf
యూఏఈ: ఎల్పీజీ సిలిండర్లకు కొత్త మార్గదర్శకాలు జారీ

దుబాయ్: ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్ కు సంబంధించి దుబాయ్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ-డిఎస్‌సిఇ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్తగా జారీ అయిన ఆదేశాల ప్రకారం..ఎల్‌పిజి సిలిండర్లు అనుమతి పొందిన నిర్ణీత ఎల్‌పిజి ఫ్యాక్టరీలలో రీఫిల్ చేస్తేనే డిస్ట్రిబ్యూట్ కు అవకాశం ఉంటుంది. సిలిండర్ల రీఫిల్ విషయంలో అత్యధిక భద్రత ప్రమాణాలు పాటించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ తాజా ఆదేశాలు జారీ చేసినట్లు డిఎస్‌సిఇ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఎల్‌పిజి ఫ్యాక్టరీలలో రీఫిల్ కు సంబంధించి తగిన భద్రత ప్రమాణాలు అనుసరిస్తున్నారో లేదో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇదిలాఉంటే..ఎల్పీజీ దాని అనుబంధ సంస్థల నుంచి డిస్ట్రిబ్యూటర్ లైసెన్స్ ల జారీ లేదా రెన్యూవల్ పొందాలంటే డిఎస్‌సిఇ నుంచి లిఖిత పూర్వక అనుమతి తప్పనిసరి అని ప్రకటించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com