సుప్రీం కమిటీ సూచనలను పాటించాలని ఒమన్ పోలీసుల పిలుపు

- May 15, 2021 , by Maagulf
సుప్రీం కమిటీ సూచనలను పాటించాలని ఒమన్ పోలీసుల పిలుపు

ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ..వైరస్ ప్రభావాన్ని అడ్డుకునేందుకే కీలక సూచనలు చేసిందని రాయల్ ఒమన్ పోలీసులు అన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా కమిటీ సూచనలను అమలు చేసే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రజలందరూ ఖచ్చితంగా కమిటీ సూచనలను పాటించాలని మరోసారి హెచ్చరించింది. ముఖ్యంగా జనం సమూహాలుగా గుమికూడొద్దని వార్నింగ్ ఇచ్చింది. కమిటీ సూచనల మేరకు ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమి కూడితే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కమిటీ సూచనలు ప్రజల ఆరోగ్య భద్రత కోసమేనని అర్ధం చేసుకోని సహకరించాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com