గాజాసిటీ పై ఇజ్రాయెల్ దాడులు
- May 15, 2021
గాజా సిటీ: గాజాసిటీ పై ఇజ్రాయెల్ దాడులను పెంచింది.ఇక్కడి అంతర్జాతీయ మీడియా కార్యాలయాలపై శనివారం వైమానిక దాడులు జరిపించింది.అల్-జజీరా టీవీ వంటి పలు మీడియా ఆఫీసులు ఈ దాడుల్లో దెబ్బ తిన్నాయి. అసోసియేటెడ్ ప్రెస్ సహా ఇంకా స్థానిక కార్యాలయాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి.జలాల్ టవర్ అనే 13 అంతస్థుల ఈ భవన యజమాని జవాన్ మెహదీని ఇజ్రాయెల్ అధికారులు ఓ గంట ముందుగా హెచ్చరించి వీటిలోని సిబ్బందిని ఖాళీ చేయాల్సిందిగా కోరారట.లేని పక్షంలో బాంబుల వర్షం కురిపిస్తామని గట్టి వార్నింగ్ ఇఛ్చారట. ఇక్కడి ఓ శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడిలో 10 మంది సభ్యులున్న కుటుంబమంతా హతులు కాగా కుటుంబ పెద్ద ఒకరు, 5 నెలల ఓ శిశువు మాత్రం బతికి బయట పడ్డారు. అమాయకులైన తాము ఏం చేశామని ఆ కుటుంబ పెద్ద ఆవేదనగా చెప్పాడు.తాము సాధారణ పౌరులమని, ఈ పోరాటం గురించి తమకేమీ తెలియదని ఆయన అన్నాడు.అయితే హమాస్ టెర్రర్ ఆర్గనైజేషన్ కు చెందిన అధికారులు ఈ శిబిరాన్ని వినియోగించుకుంటున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

హమాస్ వర్గం ఇజ్రాయెల్ పైకి 2 వేలకు పైగా రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో 10 మంది ఇజ్రాయెలీలు మరణించారు. కాగా- ఆరు రోజులుగా సాగుతున్న ఈ పోరులో 39 మంది పిల్లలతో సహా 139 మంది పాలస్తీనీయులు మృతి చెందారు.1000 మందికి పైగా గాయపడ్డారు.ఇప్పట్లో తాము గాజా సిటీపై దాడులను ఆపే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మళ్ళీ హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం









