భారత ఎంబసీలో మే 21న ఆయూష్ ఇన్ఫర్మేషన్ సెల్ ప్రారంభం

- May 16, 2021 , by Maagulf
భారత ఎంబసీలో మే 21న ఆయూష్ ఇన్ఫర్మేషన్ సెల్ ప్రారంభం

కువైట్ సిటీ: కువైట్ లోని భారత సమాజం కోసం ఇండియన్ ఎంబసీలో ప్రత్యేకంగా ఆయూష్ సమాచార కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. మే 21న శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆయూష్ కార్యదర్శి వైద్య రాజేష్ ఆయూష్ సమాచార కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఇదే సందర్భంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం -2021కి సంబంధించి సన్నాహక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. కువైట్లోని భారతీయులు, శ్రేయోభిలాషులు https://zoom.us/j/92794135807?pwd=Mm95b2ZpeGdsSDVnV3F6S0RmK1VwZz09 లింక్ ద్వారా ఆన్ లైన్ లో పాల్గొనాలని భారత రాయబార కార్యాలయం ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎంబసీ సోషల్ మీడియాలో కూడా ప్రసారం చేయనుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com