విజయ డెయిరీ విభజన ప్రక్రియ...
- March 04, 2016
పాడి అభివృద్ధి సహకార సమాఖ్యగా రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ పాడి అభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) విభజన ప్రక్రియ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర పాడి అభివృద్ధి సహకార సమాఖ్య పేరుతో రిజిస్ట్రేషన్ పూర్తయింది. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని శుక్రవారం తెలంగాణ విజయ డెయిరీ అధికారులు అందుకున్నారు. అయితే తెలంగాణలోనూ విజయ డెయిరీ పేరే కొనసాగనుంది. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఏపీ డెయిరీకి చైర్మన్గా మన్మోహన్సింగ్ ఉండగా, తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్గా తెలంగాణ పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్చందా వ్యవహరించనున్నారని విజయ డెయిరీ వర్గాలు తెలిపాయి.
దశల వారీగా ఆస్తుల విభజన ప్రక్రియ జరగనుంది. ఏపీలో 52 మంది ఉద్యోగులుండగా, తెలంగాణ డెయిరీలో 390 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, ఏపీలోనూ తెలంగాణ పాల సేకరణ ఉన్నందున కలసి పనిచేస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదిలాఉండగా ఏపీ డెయిరీకి గత పదేళ్లకు పైగా ఎన్నికలు జరగలేదు. డెయిరీ విభజన పూర్తిస్థాయిలో జరిగి తెలంగాణ డెయిరీ ఏర్పడ్డాక పాడి సహకార ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని వ్యవసాయ మంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









