కోవిడ్ పీసీఆర్ టెస్టు ఛార్జీలు 20 దినార్లకు తగ్గింపు

- May 18, 2021 , by Maagulf
కోవిడ్ పీసీఆర్ టెస్టు ఛార్జీలు 20 దినార్లకు తగ్గింపు

కువైట్ సిటీ: కోవిడ్ వైరస్ నిర్ధారణకు నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ఛార్జీలను సవరించింది కువైట్ ప్రభుత్వం. పీసీఆర్ టెస్ట్ ఛార్జీలను 20 దినార్లకు తగ్గించింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉత్తర్వ్యులు జారీ చేశారు. ప్రస్తుతం కువైట్లో పీసీఆర్ టెస్టుకుగాను 24 నుంచి 26 దినార్ల వరకు ఛార్జ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే..ఇక నుంచి  పీసీఆర్ టెస్ట్ కు 20 దినార్లకు మించి ఛార్జ్ చేయోద్దని తాజా ఉత్తర్య్వుల్లో ఆదేశించారు. మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన అన్ని లాబరేటరీలకు సవరణ ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా, దేశీయంగా పీసీఆర్ టెస్టు ఛార్జీల మధ్య వ్యత్యసాన్ని సమీక్షించిన తర్వాతే తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ వివరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com