కోవిడ్ ను జయించిన వారికి ప్రత్యేక రివార్డ్
- May 20, 2021
విజయవాడ: కృష్ణా జిల్లా యంత్రాంగం జిల్లాలో 7 కేంద్రాల్లో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొంది కోవిడ్ ను జయించి ఇళ్లకు చేరుకున్న వారిలో గత సోమవారం జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ సమక్షంలో నిర్వహించిన మొదటి వారం లక్కీ డిప్ లో విజేతలకు గురువారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బహుమతులు అందజేశారు.

గూడవల్లి కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొంది ఆరోగ్యం గా ఇళ్లకు చేరుకున్న నిడమనూరు కు చెందిన కె.సూర్యనారాయణ, చంద్రర్లపాడు మండలం కొడవలకల్లు గ్రామానికి చెందిన ఏ.వెంకట నరసింహ,తెలప్రోలు గ్రామానికి చెందిన టి. సురేంద్ర లకు మొదటివారం విజేతలకు మొదటి బహుమతి గా రూ.15,000/-,రెండవ బహుమతిగా రూ.10,000/-,మూడవ బహుమతిగా రూ.5,000/-లు చొప్పున మంజూరు చేసిన బ్యాంక్ పత్రాలు కలెక్టర్ ఇంతియాజ్ అందచేశారు.
బహుమతి సొమ్మును నేరుగా విజేతలు బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ విజేతల మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్లో సదుపాయాలు, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంఏది తమ పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయతలు మందుల కన్న ఎక్కువ రోగ నిరోధానికి దోహదపడ్డాయని కోవిడ్ విజేతలు ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ కు తెలుపుతూ,కోవిడ్ కేర్ సెంటర్లో మంచి సదుపాయాలు ఇంట్లో ఉన్న అనుభూతి కలిగించదన్నారు.ఇందుకు ముఖ్యమంత్రి కి,కృష్ణా కలెక్టర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







