పొన్నాంబళం చికిత్సకు చిరంజీవి రెండు లక్షల సాయం..!
- May 21, 2021
చెన్నై: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారగుణాన్ని చాటుకున్నారు.తమిళ నటుడు పొన్నాంబళం గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న చిరు...పొన్నాంబళం బ్యాంకు ఖాతాలోకి రెండు లక్షల రూపాయలను పంపించారు. ఈ విషయాన్ని పొన్నాంబళం తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.ఈ సందర్భంగా చిరంజీవికి ధన్యవాదాలు తెలిపాడు. 'నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం రెండులక్షల రూపాయలు పంపినందుకు ధన్యవాదాలు. మీ సహాయాన్ని నేనెప్పటికీ మరచిపోలేను' అని అన్నాడు. కాగా పొన్నాంబళం గతకొన్నాళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. అటు చిరంజీవి, పొన్నాంబళం కలిసి ముగ్గురు మొనగాళ్ళు, ఘరానా మొగుడు మొదలగు చిత్రాలలో కలిసి నటించారు. ఇదిలావుండగా ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్న తెలుగు సీనియర్ నటి పావలా శ్యామలకి తాజాగా లక్ష రూపాయలు సహాయం చేశారు చిరంజీవి.
తాజా వార్తలు
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







