బహ్రెయిన్ కోవిడ్ రోగుల కోసం అదనంగా 500 పడకల ఏర్పాటు

- May 21, 2021 , by Maagulf
బహ్రెయిన్ కోవిడ్ రోగుల కోసం అదనంగా 500 పడకల ఏర్పాటు

బహ్రెయిన్: కరోనా వైరస్ కేర్ వింగ్స్ కోసం అదనంగా మరో 500 పడకల్ని ఏర్పాటు చేయనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ షేక్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా (సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అలాగే నేషనల్ మెడికల్ టీమ్ కోవిడ్ 19 ఛైర్మన్) ఈ విషయాన్ని వెల్లడించారు. జీజీసీ వ్యాప్త నిర్ణయం నిమిత్తం ఎంపీలు, షురా కౌన్సిల్ మెంబర్లు వ్యాక్సిన్ అనుమతి మరియు విధి విధానాలపై చర్చిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రైవేటు రంగ సంస్థలూ తమవంతు సహాయ సహకారాలు అందించేలా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చలు జరుగుతున్నాయి. కొత్తగా మందులు, ఇతర మెడికల్ పరికరాల్ని పెద్దయెత్తున దిగుమతి చేసుకోవడం, ఫ్రంట్ లైన్ వారియర్ల పెంపు వంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com