కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 828 మందిపై కేసుల నమోదు

- May 21, 2021 , by Maagulf
కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 828 మందిపై కేసుల నమోదు

దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు, కోవిడ్ 19 నిబంధనల్ని ఉల్లంఘిస్తోన్నవారిపై చర్యల దిశగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా మే 20న మొత్తం 828 ఉల్లంఘనల్ని గుర్తించారు. ఫేస్ మాస్కులను ధరించని 523 మందిపై కేసులు నమోదు చేశారు. పార్కులు, ఇతర ప్రాంతాల్లో గుమికూడిన 209 మందిపైనా కేసులు నమోదు చేయడం జరిగింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించని 34 మంది పైన కేసులు నమోదయ్యాయి. ఎహ్తెరాజ్ అప్లికేషన్ లేని కారణంగా 13 మందిపై కేసులు నమోదు చేశారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన 10 మందిపై కూడా కేసులు నమోదయ్యాయి. వీళ్ళందరిపైన కేసులకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ పరిశీలనకు పంపడం జరిగింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com