సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు..
- May 22, 2021న్యూ ఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ భారత్లో కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. భారత్లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయంటూ ప్రచారం జరిగింది.ముఖ్యంగా.. కరోనా బీ.1.617 వేరియంట్ను భారత్ వేరియంట్గా పలు కథనాలు వచ్చాయి.ఈ నేపథ్యంలో సోషల్ మీడియా సంస్థలను కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం..WHO తమకు సంబంధించిన ఏ నివేదికలోనూ భారత్ వేరియంట్ అనే పదాన్ని వాడలేదని, ఇది పూర్తిగా తప్పుడు సమాచారమంటూ ఆయా సంస్థలకు కేంద్ర ఐటీ శాఖ లేఖ రాసింది.ఇక, ఇదే సమయంలో భారత్ కరోనా వేరియంట్.. ప్రపంచ దేశాల్లో విస్తరిస్తోందని తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని.. బీ.1.617 వేరియంట్పై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ కూడా ఇచ్చిందని లేఖలో పేర్కొంది కేంద్ర ఐటీశాఖ.
కాగా, బీ.1.617 వేరియంట్ కరోనా వైరస్ సూపర్ ఫాస్ట్గా విస్తరిస్తూ.. చాలా ప్రాణాలను తీసింది.ఇది, భారత్ వేరియంట్గా WHO పేర్కొన్నట్లు మీడియాలోనూ అనేక కథనాలు వచ్చాయి.కానీ, బీ.1.617 అనేది భారత్ వేరియంట్ అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాలు లేవని, ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించే ముందు మీడియా జాగ్రత్త వ్యవహరించాలని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.ఇప్పుడు, సోషల్ మీడియా సంస్థలకు కూడా లేఖలు రాసింది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..