ఆనందయ్య కరోనా మందు పరిశీలనకు వైద్యుల బృందం!
- May 23, 2021
నెల్లూరు: సంచలనంగా మారిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందును ఆయుష్ శాఖ, ఐసీఎంఆర్ పరిశోధనలు చేస్తున్నాయి. ఈ మందుపై శాస్త్రీయ నిర్ధారణ కోసం కేంద్ర ఆయుర్వేదిక్ పరిశోధనా సంస్థ వైద్యులు సోమవారం కృష్ణపట్నం చేరుకోనున్నారు. వారు స్వయంగా మందును పరిశీలించి అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా కరోనా మందును పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం మందు పంపిణీ పూర్తిగా ఆగిపోయింది.
ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందుపై పూర్తి నమ్మకం ఉందని గ్రామస్థులు మరోసారి స్పష్టంచేశారు. తమ గ్రామంలో కరోనా లేదని, ఆనందయ్య మందువల్లే సాధ్యమైందని చెబుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ప్రజలందరికీ పంపిణీ చేస్తామని అంటున్నారు. మరోవైపు, శాస్త్రీయత, సామర్థ్యం నిరూపణ అయ్యేంతవరకు కృష్ణపట్నం ఔషధ పంపిణీని నిలిపివేయాలని జన విజ్ఞాన వేదిక, ప్రజా ఆరోగ్య వేదిక సభ్యులు కోరారు. నిబంధనలు పాటించకుండా మందు పంపిణీ చేసి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







