సైబరాబాద్ లో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన

- May 25, 2021 , by Maagulf
సైబరాబాద్ లో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన

హైదరాబాద్: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని JNTU చెక్ పోస్ట్ దగ్గర తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ  మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోందని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో లాక్‌డౌన్ బందోబస్తు కొనసాగుతోందన్నారు.లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సైబరాబాద్ ప్రజలు పోలీసులకి సహకరిస్తున్నారని తెలిపారు.సైబరాబాద్ లో కర్ఫ్యూ ఏవిధంగా ఉందో పరిశీలించడానికి తాను ఇక్కడికి వచ్చానని మహేందర్‌రెడ్డి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com