లోన్ చెల్లింపులపై రిలీఫ్..ఈఎంఐ చెల్లింపులు వాయిదా
- May 28, 2021బహ్రెయిన్: కోవిడ్ తో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో బ్యాంక్ లోన్లు రుణగ్రహీతలకు అదనపు భారం కాకుండా బహ్రెయిన్ ప్రభుత్వం మరోసారి మారటోరియం ప్రకటించింది బహ్రెయిన్. ఆరు నెలల పాటు రుణాల ఈఎంఐ వసూళ్లను వాయిదా వేస్తూ నిర్ణయించింది. కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా రాయల్ ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ దేశంలోని అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు మారటోరియం సర్క్యూలర్ జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అంటే 6 నెలల పాటు లోన్ వాయిదాల చెల్లింపులు వాయిదా వేసుకోవచ్చు. ఈ మారటోరియం కాలానికి సంబంధించి ఎలాంటి ఆలస్యం రుసుములు, అదనపు ఛార్జీలు, వడ్డీలు ఉండవు. అలాగే వాయిదాల సంఖ్యను పెంచొద్దని, అయితే..వాయిదా వ్యవధిని బట్టి రుణాలపై వర్తించే వడ్డీ రేట్లు యధాతథంగా కొనసాగుతాయిని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!