యూఏఈలో ఐపీఎల్ సెకండాఫ్: బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
- May 29, 2021
న్యూ ఢిల్లీ: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ను పున: ప్రారంభించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.ఇవాళ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం వాయిదా పడిన ఐపీఎల్ 2021ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది.సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య టోర్నీలో మిగిలిన మ్యాచ్లు జరగనున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది నిర్వహించిన వేదికల్లోనే మిగిలిన 31 మ్యాచ్లను నిర్వహించనున్నారు. దుబాయ్, అబుధాబి, షార్జా స్టేడియంలలో బయోబబుల్ వాతావరణంలో లీగ్ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. మరికొద్ది రోజుల్లో లీగ్, ప్లేఆఫ్ మ్యాచ్లు, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ను ప్రకటించనుంది. కాగా, ఐపీఎల్ సెకండాఫ్కు ఆసీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







