చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వున్నవారికి వ్యాక్సినేషన్ అందుబాటులో
- May 31, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయమై స్పష్టతనిచ్చింది. పౌరులు అలాగే నివాసితులు ఎవరికైతే రెసిడెన్సీ వుంటుందో వారందరికీ వ్యాక్సినేషన్ అందుబాటులో వుందని పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిథి డాక్టర్ ముహమ్మద్ అల్ అబ్దులాలీ ఈ విషయాన్ని వెల్లడించారు. వైరస్ ప్రమాదకరమైనదనే విషయాన్ని మరోమారు స్పష్టం చేశారాయన. ఎవరూ దీన్ని తేలిగ్గా తీసుకోకూడదని తేల్చి చెప్పారు అబ్దులాలీ. 100 మందికి కరోనా సోకితే, 10 మంది ఇంటెన్సివ్ కేర్ చికిత్స పొందాల్సి వస్తోంది. వారిలో ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతున్నారని వివరించారు. వ్యాక్సిన్ పొందినవారిని పరిగణనలోకి తీసుకుంటే, 100 మందికి కరోనా సోకితే.. అందులో ఒక్కరు కూడా ఆసుపత్రిలో చేరే అవసరం రావడంలేదు గనుకనే, వ్యాక్సిన్ తప్పనిసరి అని చెప్పారు. కుటుంబ పరమైన వేడుకల వల్ల 75 శాతం వరకు కేసులు నమోదవుతున్నట్లు అబ్దులాలి చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









