చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వున్నవారికి వ్యాక్సినేషన్ అందుబాటులో
- May 31, 2021రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయమై స్పష్టతనిచ్చింది. పౌరులు అలాగే నివాసితులు ఎవరికైతే రెసిడెన్సీ వుంటుందో వారందరికీ వ్యాక్సినేషన్ అందుబాటులో వుందని పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిథి డాక్టర్ ముహమ్మద్ అల్ అబ్దులాలీ ఈ విషయాన్ని వెల్లడించారు. వైరస్ ప్రమాదకరమైనదనే విషయాన్ని మరోమారు స్పష్టం చేశారాయన. ఎవరూ దీన్ని తేలిగ్గా తీసుకోకూడదని తేల్చి చెప్పారు అబ్దులాలీ. 100 మందికి కరోనా సోకితే, 10 మంది ఇంటెన్సివ్ కేర్ చికిత్స పొందాల్సి వస్తోంది. వారిలో ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతున్నారని వివరించారు. వ్యాక్సిన్ పొందినవారిని పరిగణనలోకి తీసుకుంటే, 100 మందికి కరోనా సోకితే.. అందులో ఒక్కరు కూడా ఆసుపత్రిలో చేరే అవసరం రావడంలేదు గనుకనే, వ్యాక్సిన్ తప్పనిసరి అని చెప్పారు. కుటుంబ పరమైన వేడుకల వల్ల 75 శాతం వరకు కేసులు నమోదవుతున్నట్లు అబ్దులాలి చెప్పారు.
తాజా వార్తలు
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు