చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వున్నవారికి వ్యాక్సినేషన్ అందుబాటులో
- May 31, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయమై స్పష్టతనిచ్చింది. పౌరులు అలాగే నివాసితులు ఎవరికైతే రెసిడెన్సీ వుంటుందో వారందరికీ వ్యాక్సినేషన్ అందుబాటులో వుందని పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిథి డాక్టర్ ముహమ్మద్ అల్ అబ్దులాలీ ఈ విషయాన్ని వెల్లడించారు. వైరస్ ప్రమాదకరమైనదనే విషయాన్ని మరోమారు స్పష్టం చేశారాయన. ఎవరూ దీన్ని తేలిగ్గా తీసుకోకూడదని తేల్చి చెప్పారు అబ్దులాలీ. 100 మందికి కరోనా సోకితే, 10 మంది ఇంటెన్సివ్ కేర్ చికిత్స పొందాల్సి వస్తోంది. వారిలో ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతున్నారని వివరించారు. వ్యాక్సిన్ పొందినవారిని పరిగణనలోకి తీసుకుంటే, 100 మందికి కరోనా సోకితే.. అందులో ఒక్కరు కూడా ఆసుపత్రిలో చేరే అవసరం రావడంలేదు గనుకనే, వ్యాక్సిన్ తప్పనిసరి అని చెప్పారు. కుటుంబ పరమైన వేడుకల వల్ల 75 శాతం వరకు కేసులు నమోదవుతున్నట్లు అబ్దులాలి చెప్పారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







