ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- May 31, 2021
అమరావతి: ఆనందయ్య మందుకు మొత్తానికి ఆనందయ్య కరోనా మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.అయితే, ఇదే సమయంలో.. కంట్లో వేసే చుక్కుల మందుకు అనుమతి నిరాకరించింది.ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం..ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. అయితే, కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నందున.. ప్రస్తుతానికి ఆ మందుకు అనుమతి నిరాకరించింది. ఇక, ఇప్పటి వరకు వచ్చిన నివేదికలు అన్ని. ఆనందయ్య మందు వల్ల హాని లేదని తేల్చేశాయి.. కాగా, మొత్తం ఐదు రకాల మందులు తయారు చేస్తూ వచ్చారు ఆనందయ్య.. అందులో కంట్లో వేసే మందుకు మాత్రం ఇప్పుడు బ్రేక్ పడగా.. మిగతా నాలుగు మందులు తయారు చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు అయ్యింది.
అయితే, ఆనందయ్య మందుతో హానిలేదని నివేదికలు తేల్చినా.. ఆ మందు వాడితే కోవిడ్ తగ్గుతుందనడాకి నిర్ధారణ లేదని నివేదికలో పేర్కొన్నారు. కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదిక రావడానికి మరో 2-3 వారాల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతోంది ఏపీ ప్రభుత్వం.. ఇదే సమయంలో.. ఆనందయ్య మందు తీసుకోవడానికి కోవిడ్ రోగులు రావొద్దు అని స్పష్టం చేసింది.కోవిడ్ రోగుల బంధువులు వచ్చి మందు తీసుకెళ్లాలని సూచించింది. ఇక, మందు పంపిణీలో కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసేంది.ప్రస్తుతానికి అయితే.. ఆనందయ్య ఇచ్చే పీ.ఎల్.ఎఫ్ మందుకు అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







