ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- May 31, 2021
అమరావతి: ఆనందయ్య మందుకు మొత్తానికి ఆనందయ్య కరోనా మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.అయితే, ఇదే సమయంలో.. కంట్లో వేసే చుక్కుల మందుకు అనుమతి నిరాకరించింది.ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం..ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. అయితే, కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నందున.. ప్రస్తుతానికి ఆ మందుకు అనుమతి నిరాకరించింది. ఇక, ఇప్పటి వరకు వచ్చిన నివేదికలు అన్ని. ఆనందయ్య మందు వల్ల హాని లేదని తేల్చేశాయి.. కాగా, మొత్తం ఐదు రకాల మందులు తయారు చేస్తూ వచ్చారు ఆనందయ్య.. అందులో కంట్లో వేసే మందుకు మాత్రం ఇప్పుడు బ్రేక్ పడగా.. మిగతా నాలుగు మందులు తయారు చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు అయ్యింది.
అయితే, ఆనందయ్య మందుతో హానిలేదని నివేదికలు తేల్చినా.. ఆ మందు వాడితే కోవిడ్ తగ్గుతుందనడాకి నిర్ధారణ లేదని నివేదికలో పేర్కొన్నారు. కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదిక రావడానికి మరో 2-3 వారాల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతోంది ఏపీ ప్రభుత్వం.. ఇదే సమయంలో.. ఆనందయ్య మందు తీసుకోవడానికి కోవిడ్ రోగులు రావొద్దు అని స్పష్టం చేసింది.కోవిడ్ రోగుల బంధువులు వచ్చి మందు తీసుకెళ్లాలని సూచించింది. ఇక, మందు పంపిణీలో కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసేంది.ప్రస్తుతానికి అయితే.. ఆనందయ్య ఇచ్చే పీ.ఎల్.ఎఫ్ మందుకు అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









