ఏపీలో క‌ర్ఫ్యూ మ‌ళ్లీ పొడిగింపు

- May 31, 2021 , by Maagulf
ఏపీలో క‌ర్ఫ్యూ మ‌ళ్లీ పొడిగింపు

అమరావతి: క‌రోనా రోజువారి కొత్త కేసుల న‌మోదు సంఖ్య త‌గ్గినా..ఇంకా భారీగానే వెలుగు చూస్తుండ‌డంతో..మ‌రోసారి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది ఏపీ ప్రభుత్వం .. కరోనా కట్టడి కోసం విధించిన కర్ఫ్యూను మ‌రోసారి పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.మే 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఆంక్షలు.. ఇవాళ్టితో ముగియ‌నుండ‌గా.. మరో 10 రోజులు పాటు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్ర‌భుత్వం.ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ అవసరాల నిమిత్తం స‌డ‌లింపులు ఉండ‌గా.. ఆ స‌మ‌యాన్ని కూడా య‌థాత‌థంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com