కోవిడ్ టెస్టుల ధరలపై పర్యవేక్షించనున్న సీపీఏ
- June 04, 2021
ఒమన్: కోవిడ్ 19 టెస్టులకు సంబంధించి అడ్డగోలు ఛార్జీలకు ఆస్కారం లేకుండా ఒమన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ టెస్టు ధరలను తాము పర్యవేక్షించనున్నట్లు వినియోగదారుల భద్రత అధికార విభాగం కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వెల్లడించింది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు అనుమతి పొందిన ప్రైవేట్ ఆత్రులన్ని వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా టెస్ట్ ఛార్జీలను తీసుకోవాలని సీపీఏ సూచించింది. టెస్ట్ ఛార్జీలపై తమ పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించింది. మహమ్మారితో పోరాడుతున్న ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో ఛార్జీల పేరుతో ప్రజలను దోపిడి చేయకుండా ఉండేందుకు తాము కట్టుబడి ఉన్నామని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ తీర్మానం 16/2021 మేరకు ప్రభుత్వం సూచించిన ధరలకు మించి ఛార్జీ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని సీపీఏ హెచ్చరించింది.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







