కోవిడ్ టెస్టుల ధరలపై పర్యవేక్షించనున్న సీపీఏ

- June 04, 2021 , by Maagulf
కోవిడ్ టెస్టుల ధరలపై పర్యవేక్షించనున్న సీపీఏ

ఒమన్: కోవిడ్ 19 టెస్టులకు సంబంధించి అడ్డగోలు ఛార్జీలకు ఆస్కారం లేకుండా ఒమన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ టెస్టు ధరలను తాము పర్యవేక్షించనున్నట్లు వినియోగదారుల భద్రత అధికార విభాగం కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వెల్లడించింది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు అనుమతి పొందిన ప్రైవేట్ ఆత్రులన్ని వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా టెస్ట్ ఛార్జీలను తీసుకోవాలని సీపీఏ సూచించింది. టెస్ట్ ఛార్జీలపై తమ పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించింది. మహమ్మారితో పోరాడుతున్న ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో ఛార్జీల పేరుతో ప్రజలను దోపిడి చేయకుండా ఉండేందుకు తాము కట్టుబడి ఉన్నామని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ తీర్మానం  16/2021 మేరకు ప్రభుత్వం సూచించిన ధరలకు మించి ఛార్జీ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని సీపీఏ హెచ్చరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com