రెస్టారెంట్లలో డైనింగ్ గైడ్ లైన్స్ ను సవరించిన అబుధాబి

- June 05, 2021 , by Maagulf
రెస్టారెంట్లలో డైనింగ్ గైడ్ లైన్స్ ను సవరించిన అబుధాబి

అబుధాబి: కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో రెస్టారెంట్లు, కేఫ్ లకు సంబంధించి కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది అబుధాబి.ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రెస్టారెంట్, కేఫ్ లకు వెళ్లినప్పుడు ఒక టేబుల్ పై పరిమిత సంఖ్యను పాటించాల్సిన అవసరం లేదు. ఇక నుంచి సేమ్ ఫ్యామిలీకి చెందిన వాళ్లైతే ఒక టేబుల్ పై ఎంతమందికైనా డైనింగ్ సర్వీస్ అందించవచ్చు. ఈ మేరకు అబుధాబి అత్యవసర, విపత్తుల నిర్వహణ కమిటీ ప్రకటన విడుదల చేసింది. మహమ్మారి వైరస్ నేపథ్యంలో గత నాలుగు నెలలుగా రెస్టారెంట్లు, కేఫ్ లలో టేబుల్ పరిమితి ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. అయితే..రెస్టారెంట్లు, కేఫ్ లలో పూర్తి స్థాయి సామర్ధ్యం అనుమతి ఆంక్షలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. 

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com