హజ్ యాత్ర పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు:కేంద్ర మంత్రి అబ్బాస్​ నఖ్వీ

- June 06, 2021 , by Maagulf
హజ్ యాత్ర పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు:కేంద్ర మంత్రి అబ్బాస్​ నఖ్వీ

న్యూ ఢిల్లీ: ఈ సంవత్సరం జరగనున్న హజ్​ యాత్రపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి ముఖ్తార్​​ అబ్బాస్​ నఖ్వీ అన్నారు. కరోనా రెండో దశ కొనసాగుతున్నందున హజ్​ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధార‌ప‌డి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సౌదీ ప్రభుత్వ నిర్ణయానికి భారత్‌ అండగా ఉంటుందన్నారు.యాత్ర గత సంవత్సరం రద్దయిందని, ఈ సంవత్సరం ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని నఖ్వీ పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ సంక్రమణ నేపథ్యంలో సౌదీ అరేబియా గత ఏడాది ఇతర దేశాలకు చెందిన యాత్రికులు హజ్‌లో పాల్గొనకుండా నిషేధం విధించింది. పరిమిత సంఖ్యలో దేశీయ యాత్రలకే మాత్రమే అనుమతి ఇచ్చింది.పరిమిత సంఖ్యలో యాత్రకు అనుమతి ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com