వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్న సోను సూద్
- June 09, 2021
సోను సూద్, పంజాబ్లోని మోగా జిల్లాలో గల తన స్వస్థలమైన సఫువాలా గ్రామంలో ఈ వారం వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తాజా ప్రకటన. పంజాబ్, ఈ ఏడాది ఏప్రిల్లో సోను సూద్ ను కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించారు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్. తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేసే క్రమంలో సోను సూద్ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి మరెందరికో సాయం అందిస్తున్నారు.
విలేఖరులతో మాట్లాడుతూ “ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయించాలనే ఆలోచన ఉంది. పంజాబ్లో సమస్య ఏమిటంటే, ప్రజలు ఇప్పటికీ కోవిడ్ కు వ్యాక్సిన్ తీసుకోకుండా దూరంగా ఉన్నారు. కాబట్టి, మోగాలో ఉంటున్న నా సోదరి మాల్వికా సూద్, గ్రామంలోని సర్పంచ్తో చర్చించి ఈ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆమె గ్రామస్తులతో కూడా సమావేశమైంది. వ్యాక్సిన్లు వేయడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి నేను వీడియో సందేశాలను కూడా పంచుకున్నాను. నేను అక్కడ 18 ఏళ్ల పైబడిన వ్యక్తులకు వ్యాక్సిన్లను స్పాన్సర్ చేస్తాను.” బాలీవుడ్ ప్రజలు మరియు పరిశ్రమ ప్రజలు టీకాలు వేయడానికి సహాయపడటానికి త్వరలో ముంబైలో ఇలాంటి టీకా డ్రైవ్ నిర్వహించాలని తాను కోరుకుంటున్నానని సోను సూద్ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆపదలో ఆదుకునే గొప్ప మనసు గల సోను సూద్ చేప్పట్టిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇతరులకు ఒక ఉదాహరణగా నిలుస్తుందని, అతి త్వరలో రాష్ట్రం మొత్తానికి టీకాలు వేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







