ప్రవాసీయులను ఉద్దేశించి శుక్రవారం మాట్లాడనున్న మినిస్టర్ జై శంకర్

- June 09, 2021 , by Maagulf
ప్రవాసీయులను ఉద్దేశించి శుక్రవారం మాట్లాడనున్న మినిస్టర్ జై శంకర్

కువైట్: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జై శంకర్, కువైట్‌లోని భారత సమాజంతో శుక్రవారం 11 జూన్ 2021న మాట్లాడనున్నారు. వర్చువల్ విధానంలో సాగే ఈ కార్యక్రమంలో భారతీయులంతా పాల్గొనాలని కోరుతున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు య్యూ ట్యూబ్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొనవచ్చు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కువైట్ చేరుకుంటున్నారు డాక్టర్ ఎస్ జై శంకర్. ఈ పర్యటనలో కువైట్ అథారిటీస్‌తో ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా కువైట్ వస్తున్నారాయన. కాగా, కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో కువైట్, భారతదేశానికి మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com