కేరళ బంగారం స్కాం.. సూత్రధారి మహమ్మద్ మన్సూర్‌ అరెస్ట్‌

- June 09, 2021 , by Maagulf
కేరళ బంగారం స్కాం.. సూత్రధారి మహమ్మద్ మన్సూర్‌ అరెస్ట్‌

తిరువనంతపురం: బంగారం స్కాంలో సూత్రధారి మహమ్మద్ మన్సూర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఈ కేసులో ఇప్పటికే 20 మందిని ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది.గత ఏడాది జూలై 5న త్రివేండ్రం విమానాశ్రయంలో లో 30 కిలోల బంగారం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకోగా.. దుబాయ్ నుండి త్రివేండ్రంకు మహమ్మద్ మన్సూర్ మొత్తం స్కాంను నడిపినట్లు గుర్తించారు.ఇతర నిందితులతో కలిసి బంగారాన్ని భారత్ లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశాడు మన్సూర్..తిరువనంతపురoలో ఉన్న యూఏఈ కాన్సులెట్ అడ్రస్ కు కార్గో ద్వారా గోల్డ్ స్మగ్లింగ్ చేశాడు.ఇవాళ ఎన్‌ఐఏ.. మన్సూర్‌ను అరెస్ట్‌ చేసింది.కోర్టులో హాజరుపర్చగా..5 రోజుల కస్టడీ విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com