భారత్-యూఏఈ విమానాల రద్దును కొనసాగిస్తున్న ఎమిరేట్స్

- June 10, 2021 , by Maagulf
భారత్-యూఏఈ విమానాల రద్దును కొనసాగిస్తున్న ఎమిరేట్స్

యూఏఈ: యూఏఈ ప్రభుత్వం భారత్‌ నుంచి విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని జూలై 6 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విమానయాన సంస్ధ కూడా పొడిగింపుని వెల్లడించింది.భారత్‌లో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో ఏప్రిల్‌ 24న విమానయానం పై విధించిన నిషేధాన్ని యూఏఈ ఇప్పటివరకు రెండు సార్లు పొడిగించింది.ప్రస్తుతం దుబాయ్ నుంచి భారత్‌కు విమానాలు వెళ్లడానికి అనుమతి ఉన్నప్పటికీ భారత్‌ నుంచి మాత్రం విమానాల రాకపై నిషేధం ఉంది. కేవలం దౌత్యవేత్తలు, యూఏఈ పౌరులు,ఎంపిక చేసిన గోల్డెన్‌ వీసా హోల్డర్లను మాత్రమే తిరిగొచ్చేందుకు అనుమతిస్తున్నారు.విమానాల అప్డేట్ కొరకు http://www.emirates.com వెబ్సైట్ లో చూడవలసిందిగా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com