కువైట్-భారత్ మధ్య గృహ కార్మికుల భర్తీపై ఒప్పందం
- June 11, 2021కువైట్ సిటీ: కువైట్-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు పునాది పడి 60 ఏళ్లైన నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కువైట్లో సమావేశం అయ్యారు. కువైట్ కొత్త పాలకుడికి ప్రధాని మోదీ రాసిన సందేశ లేఖతో గల్ఫ్ కంట్రీకి చేరుకున్న భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తో కువైట్ విదేశాంగ మంత్రి షేక్ అహ్మద్ అల్-నాజర్ అల్-సబా పలు కీలక అంశాలపై చర్చించారు. రెండు దేశాల మైత్రి బంధం మరింత దృఢంగా మారుతోందని షేక్ అహ్మద్ కొనియాడారు. ఈ ఇద్దరు విదేశాంగ మంత్రుల ఆధ్వర్యంలో ఆరోగ్య, అహార భద్రతకు సంబంధించిన అంశాలతో పాటు ప్రస్తుత అంతర్జాతీయ అంశాలు, ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలసిన ఆవశ్యతపై డిస్కస్ చేశారు. భారత్ నుంచి కువైట్ కు వెళ్లే గృహ కార్మికుల భద్రతకు సంబంధించి రెండు దేశాల మధ్య డొమస్టిక్ వర్కర్స్ రిక్రూట్మెంట్ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభంలో భారత్ కు కువైట్ అందించిన సాయాన్ని ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు