భారతీయులకు వ్యాక్సిన్ ప్రోగ్రాం చేపట్టిన ఎంబసీ
- June 11, 2021బహ్రెయిన్: బహ్రెయిన్ లో ఉంటున్న భారత సమాజంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేలా ఇక్కడి ఇండియన్ ఎంబసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.బహ్రెయిన్ లో ఉంటున్న భారతీయులు అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ను తప్పకుండా తీసుకోవాలని పిలుపునిచ్చింది. అయితే..సరైన వీసా, పాస్ పోర్టు, సీపీఆర్ కార్డ్ లేకుండా వ్యాక్సిన్ తీసుకోలేకపోతున్నవారు, విజిట్ వీసాపై ప్రస్తుతం బహ్రెయిన్ లో ఉన్న భారతీయులకు కూడా ఎంబసీ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ అందించనున్నారు. అంటే సరైన గుర్తింపు కార్డులు లేని భారతీయులు కూడా https://forms.gle/pMT3v1g3o4yVgnES8 ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకొని వ్యాక్సిన్ పొందవచ్చు. ఇండియన్ క్లబ్, బహ్రెయిన్ కెరళీయ సమాజం-BKS, ICRF, వరల్డ్ ఎన్ఆర్ఐ కౌన్సిల్ సౌజన్యంతో ఎంబసీ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ డ్రైవ్ త్వరలోనే చేపట్టనున్నారు.18 ఏళ్లు నిండిన బహ్రెయిన్లోని భారతీయులు అంతా తమ వివరాలను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్