కువైట్-భారత్ మధ్య గృహ కార్మికుల భర్తీపై ఒప్పందం
- June 11, 2021
కువైట్ సిటీ: కువైట్-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు పునాది పడి 60 ఏళ్లైన నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కువైట్లో సమావేశం అయ్యారు. కువైట్ కొత్త పాలకుడికి ప్రధాని మోదీ రాసిన సందేశ లేఖతో గల్ఫ్ కంట్రీకి చేరుకున్న భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తో కువైట్ విదేశాంగ మంత్రి షేక్ అహ్మద్ అల్-నాజర్ అల్-సబా పలు కీలక అంశాలపై చర్చించారు. రెండు దేశాల మైత్రి బంధం మరింత దృఢంగా మారుతోందని షేక్ అహ్మద్ కొనియాడారు. ఈ ఇద్దరు విదేశాంగ మంత్రుల ఆధ్వర్యంలో ఆరోగ్య, అహార భద్రతకు సంబంధించిన అంశాలతో పాటు ప్రస్తుత అంతర్జాతీయ అంశాలు, ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలసిన ఆవశ్యతపై డిస్కస్ చేశారు. భారత్ నుంచి కువైట్ కు వెళ్లే గృహ కార్మికుల భద్రతకు సంబంధించి రెండు దేశాల మధ్య డొమస్టిక్ వర్కర్స్ రిక్రూట్మెంట్ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభంలో భారత్ కు కువైట్ అందించిన సాయాన్ని ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







