అమెరికాలో బాలు పాటకు పట్టాభిషేకం
- June 11, 2021వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా,తెలుగు కళాసమితి ఒమన్,సంతోషం ఫిలిం న్యూస్,శారద ఆకునూరి అమెరికా ఆధ్వర్యంలో 75వ జయంతి సందర్భంగా 10 మంది గాయకులచే 75 పాటలతో బాలు పాటకు పట్టాభిషేకం జరగబోతుంది.
ఆదివారం 13 జూన్ సాయంత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 06:00 గంటలకు టెక్సాస్ /హ్యూస్టన్ అంతర్జాలం వేదికగా ప్రముఖ గాయని అమెరికా గాన కోకిల శారద ఆకునూరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.సంతోష్ ఫిలిం న్యూస్.,TRINET,తెలుగు కళాసమితి ఒమన్ ద్వారా ప్రసారం చేయబడుతుంది.
అతిధులుగా,సినీ దర్శకులు రేలంగి నరసింహారావు,సినీ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు,మాధవపెద్ది సురేష్,వీణాపాణి,సినీ గీత రచయతలు భువన చంద్ర,సిరాశ్రీ
రవిప్రకాష్,UK నుండి డా.నగేష్ చెన్నుపాటి,సురేష్ కొండేటి,ఒమన్ నుండి అనిల్ కుమార్ కడించెర్ల,హరి వేణుగోపాల్ పాల్గొంటున్నారు.
గాయకులు రామాచారి,వినోద్ బాబు,రాము,ప్రవీణ్ కుమార్,వేణు శ్రీరంగం
సాందీప్.పవన్ చరణ్,హరి గుంట,విపంచి శశిధర్,ధనుంజయ్ బాలు 75 పాటలను మనకు వీనులవిందుగా వినిపించనున్నారు.ఈ వర్చ్యువల్ ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు