భారతీయ విద్యార్థులకు అల్గోన్క్విన్ కాలేజీ స్కాలర్షిప్, ఫీజు డిస్కౌంట్
- June 12, 2021
కువైట్: కువైట్లో తొలి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ అల్గోన్క్విన్ కాలేజీ, ట్యూషన్ ఫీజు తగ్గింపుని భారత కమ్యూనిటీ సభ్యులకు ప్రకటించింది 2021 ఫాల్ సెమిస్టర్ కోసం. అలాగే అల్గోన్క్విన్ కాలేజీ, 3 స్కాలర్షిప్స్ని కూడా ప్రకటించింది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారికి మాత్రమే ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. పలు రకాలైన డిప్లొమా కోర్సులను అల్గోన్క్విన్ కాలేజీ అందిస్తోంది. బిజినెస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ తదితర విభాగాల్లో కోర్సులను అందించడం జరుగుతోంది. కాగా, అర్హులైన భారత కమ్యూనిటీ దరఖాస్తులకు 20 శాతం ట్యూషన్ ఫీ డిస్కౌంట్ ఇస్తారు. 3.5 జీపీఏ సాధిస్తే 20 శాతం తర్వాతి సెమిస్టర్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇండియన్ ఎంబసీ లేదా కల్చరల్ అటాచీ ద్వారా భారత స్టూడెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







