కోవిడ్ 19 సహాయ నిధి ఏర్పాటు చేసిన ఎన్నారై వ్యాపారవేత్త రవి పిళ్ళై

- June 12, 2021 , by Maagulf
కోవిడ్ 19 సహాయ నిధి ఏర్పాటు చేసిన ఎన్నారై వ్యాపారవేత్త రవి పిళ్ళై

బహ్రెయిన్: ఎన్నారై వ్యాపారవేత్త రవి పిళ్ళయ్ 150 మిలియన్ రూపాయలు (7.5 మిలియన్  దిర్హాములు)ని కోవిడ్ 19 సహాయ నిధి కోసం కేటాయించారు.గల్ఫ్‌కి చెందిన ఆర్.పి. గ్రూపు ఛైర్మన్ డాక్టర్ రవి పిళ్ళై, కోరోనా బారిన పడ్డ మలయాళీల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. మలయాళీలు, వలసదారుల కోసం వీటిని ఖర్చు చేస్తారు.అవసరమైనవారికి వెంటనే ఆర్థిక సహాయం అందజేస్తామని రవి పిళ్ళై పేర్కొన్నారు. నరోకా రూట్స్ ద్వారా 2.5 మిలియన్ దిర్హాముల్ని పంపిణీ చేయనున్నారు. తమ కుమార్తెల పెళ్ళిళ్ళ సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి దీన్ని వినియోగిస్తారు. ఆర్.పి. ఫౌండేషన్ 5 మిలియన్ దిర్హాములను  కోవిడ్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారికి అందిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com