'ఐఏఎస్' కావాలనుకుంటున్నవారికీ సోనూ సూద్ సాయం..
- June 12, 2021ముంబై: సోనూసూద్ తన సేవలను విస్తరిస్తున్నారు. తాజాగా సివిల్ సర్వీసెస్లో చేరాలనుకునే వారికి అండగా నిలవాలనుకుంటున్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఎఎస్) పరీక్షకు సన్నద్ధులయ్యే వారికి ఉచితంగా కోచింగ్ తీసుకునేందుకు స్కాలర్షిప్ ప్రకటించారు. మీరు ఐఎఎస్ కోసం సిద్ధం కావాలనుకుంటే, మేము మీ బాధ్యత తీసుకుంటాము" అని సోనూ ట్వీట్ చేశారు. ఇందుకోసం సంభవం ను ప్రారంభిస్తున్నాం. అభ్యర్థులు జూన్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వెబ్సైట్ వివరాలను ఆ ట్వీట్లో పొందుపరిచారు. సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఆయన తన సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారు. మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్యను సోనూ అందిస్తున్నారు. ఇందుకోసం ఈ నెల ప్రారంభంలో, అతడు పంజాబ్ లోని సిటీ విశ్వవిద్యాలయంతో కలిసి తన సహకారాన్ని ప్రకటించారు. ఇ-రిక్షాలు, ఉపాధి కోల్పోయిన వారికి సహాయం అందించడం, వైద్య చికిత్స అందించడంతో పాటు సోనూ అనేక వేదికలను ప్రారంభించారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్