రెడ్ లిస్టు దేశాల వారికి వర్క్ పర్మిట్లు నిలిపివేత
- June 14, 2021బహ్రెయిన్: భారత్ నుంచి కొత్తగా వర్క్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి షాకిచ్చింది బహ్రెయిన్.రెడ్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే వర్క్ పర్మిట్ల దరఖాస్తును అనుమతించబోమని, ఆయా దేశాల వారికి కొత్త వర్క్ పర్మిట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ప్రయాణికులను రాకను నిషేధించిన విషయం తెలిసిందే. గత నెల 24 నుంచి ఈ మేరకు ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలను కూడా రెడ్ లిస్టులో చేర్చింది. ఇక ఇప్పుడు రెడ్ లిస్టు దేశాలవారికి కొత్త వర్క్ పర్మిట్లను ఇవ్వబోమని ప్రకటించింది. అయితే..ఈ ఆదేశాలు ఇప్పటికే బహ్రెయిన్లో ఉన్నవారికి మాత్రం వర్తించవు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ