సింగపూర్ నుంచి గన్నవరం చేరుకున్న విమానం

- June 15, 2021 , by Maagulf
సింగపూర్ నుంచి గన్నవరం చేరుకున్న విమానం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు నిలిచిపోయిన విదేశీ విమానాల రాకపోకలు మొదలయ్యాయి.సింగపూర్ కు చెందిన 37 మంది ప్రవాసాంధ్రులతో కూడిన ప్రయాణికుల ప్రత్యేక విమానం X 987 ఈ సాయంత్రం 05:29 ని.లకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో గత నెల 3 నుంచి ఇక్కడి విమానాశ్రయానికి విదేశీ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ పౌర విమానయానశాఖ నిర్ణయం తీసుకుంది.

అయితే, వందే భారత్‌ మిషన్‌లో భాగంగా తిరిగి మళ్ళీ విమాన సర్వీసులను ప్రారంభించారు. సింగపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుల భద్రతా, తనిఖీ ఏర్పాట్లను ఎయిర్‌పోర్టు అధికారులు పర్యవేక్షించారు.తొలుత థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, కస్టమ్స్ తనిఖీల అనంతరం రాష్ట్రంలోకి అనుమతినిచ్చారు. అలాగే ప్రవాసాంధ్రులను వారి వారి గమ్యస్థానాలు చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని విమానాశ్రయం డైరెక్టర్ మధుసూదన రావు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com