భవనంపై నుంచి పడి.. భారత యువకుడి దుర్మరణం!
- June 18, 2021
యూఏఈ: షార్జాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కింద పడి చనిపోయాడు. అదే భవనంలో ఉండే కొందరితో గొడవ పడ్డ యువకుడు వారి నుంచి తప్పించుకునే క్రమంలో భవనం పై నుంచి పడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు షార్జా పోలీసులు తెలిపారు. మృతుడిని టీవీ విష్ణు(29)గా గుర్తించారు. షార్జాలోని అబు షాగ్రాలో ఈ ఘటన జరిగింది. విష్ణు నివాస ముండే భవనంలోనే కొందరు ఆఫ్రికన్లు ఉన్నారు. విష్ణుతో వారు ఘర్షణ పడ్డారు.ఈ క్రమంలో ఆఫ్రికన్ల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన విష్ణు కాలు జారి కింద పడ్డాడు.తీవ్రంగా గాయపడ్డ విష్ణు అక్కడికక్కడే చనిపోయాడు.మెదడులో ఇంటర్నల్ బ్లీడిండ్ కావడంతోనే విష్ణు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన షార్జా పోలీసులు కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, అబు షాగ్రాలో విష్ణు ఓ సెలూన్లో పని చేస్తున్నట్లు తెలిసింది.ఈ కేసులో పోలీసులు కొన్ని అరెస్టులు చేసి నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు.
ధృవీకరించని సమాచారాన్ని ప్రసారం చేయవద్దని పోలీసులు నివాసితులకు సూచించారు, ఎందుకంటే ఇది నివాసితులలో భయాందోళనలకు గురి చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







