ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ

- June 19, 2021 , by Maagulf
ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా  ఇబ్రహీం రైసీ

టెహ్రాన్: ఇరాన్‌లో ఈ ఎన్నికలను రైసీ గెలిచే విధంగా మలిచారనే అభిప్రాయాలు బలంగానే వినిపించాయి.ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను ఓడించి రైసీ విజయం సాధించారు. కొందరు అభ్యర్థులను అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించలేదు.రైసీ ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయమూర్తి పదవిలో కొనసాగుతున్నారు. రాజకీయ ఖైదీలకు గతంలో ఉరిశిక్షలు విధించినందుకు రైసీపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది.ఇరాన్‌లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత రెండో శక్తిమంతమైన నాయకుడు అధ్యక్షుడే.

దేశీయ విధానాలతోపాటు విదేశీ వ్యహరాలనూ అధ్యక్షుడు ప్రభావితం చేయగలడు. అయితే, దేశానికి సంబంధించి ఎలాంటి వ్యవహారాల్లో అయినా, తుది నిర్ణయం మాత్రం ఖమేనీదే.గత అధ్యక్ష ఎన్నికల్లో రౌహనీ చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. అవినీతిపై పోరాటం చేస్తానని, దేశ ఆర్థిక సమస్యలను రూపమాపనున్నట్లు రైసీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com