ఇండియా - దుబాయ్: ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సర్వీసులు తిరిగి ప్రారంభం

- June 20, 2021 , by Maagulf
ఇండియా - దుబాయ్: ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సర్వీసులు తిరిగి ప్రారంభం

దుబాయ్: జూన్ 23 నుండి వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు దుబాయ్ కి రావచ్చు అని ప్రకటించగా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తమ సర్వీసులను జూన్ 23 నుండి భారత్ కు పునఃప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.

యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్ల రెండు డోసులను పూర్తిచేసుకున్న నివాసితులు మాత్రమే దుబాయ్ వచ్చేందుకు అర్హులు. ఈ మార్పులు జూన్ 23, 2021 నుండి అమల్లోకి వస్తాయి.

ప్రయాణీకులకు గమనిక:
* ప్రయాణికులందరూ బయలుదేరే ముందు 48 గంటల్లో తీసుకున్న నెగటివ్ కోవిడ్ టెస్టు ఫలితాన్ని సమర్పించాలి.
* క్యూఆర్ కోడెడ్ పిసిఆర్ పరీక్ష ఫలిత ధృవీకరణ పత్రాలు మాత్రమే అంగీకరించబడతాయి.
* విమాన ప్రయాణానికి 4 గంటల ముందు ప్రయాణీకులందరూ రాపిడ్ పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలి.
* ప్రయాణీకులందరూ దుబాయ్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు తప్పనిసరిగా పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలి.
* ప్రయాణీకులు తమ పిసిఆర్ పరీక్ష ఫలితాన్ని (ఇది 24 గంటల్లోపు అందుతుందని అంచనా) పొందే వరకు సంస్థాగత క్వారంటైన్ కు లోనవుతారు. యూఏఈ పౌరులు మరియు దౌత్యవేత్తలకు ఈ షరతుల నుండి మినహాయింపు కలదు.

మరిన్ని వివరాలకు www.emirates.ae లో చూడగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com