ఇండియా - దుబాయ్: ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సర్వీసులు తిరిగి ప్రారంభం
- June 20, 2021
దుబాయ్: జూన్ 23 నుండి వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు దుబాయ్ కి రావచ్చు అని ప్రకటించగా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తమ సర్వీసులను జూన్ 23 నుండి భారత్ కు పునఃప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.
యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్ల రెండు డోసులను పూర్తిచేసుకున్న నివాసితులు మాత్రమే దుబాయ్ వచ్చేందుకు అర్హులు. ఈ మార్పులు జూన్ 23, 2021 నుండి అమల్లోకి వస్తాయి.
ప్రయాణీకులకు గమనిక:
* ప్రయాణికులందరూ బయలుదేరే ముందు 48 గంటల్లో తీసుకున్న నెగటివ్ కోవిడ్ టెస్టు ఫలితాన్ని సమర్పించాలి.
* క్యూఆర్ కోడెడ్ పిసిఆర్ పరీక్ష ఫలిత ధృవీకరణ పత్రాలు మాత్రమే అంగీకరించబడతాయి.
* విమాన ప్రయాణానికి 4 గంటల ముందు ప్రయాణీకులందరూ రాపిడ్ పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలి.
* ప్రయాణీకులందరూ దుబాయ్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు తప్పనిసరిగా పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలి.
* ప్రయాణీకులు తమ పిసిఆర్ పరీక్ష ఫలితాన్ని (ఇది 24 గంటల్లోపు అందుతుందని అంచనా) పొందే వరకు సంస్థాగత క్వారంటైన్ కు లోనవుతారు. యూఏఈ పౌరులు మరియు దౌత్యవేత్తలకు ఈ షరతుల నుండి మినహాయింపు కలదు.
మరిన్ని వివరాలకు www.emirates.ae లో చూడగలరు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







