ఏడాది చివరినాటికి పర్మినెంట్ గా 80% రిమోట్ లిటిగేషన్ సర్వీసులు

- June 21, 2021 , by Maagulf
ఏడాది చివరినాటికి పర్మినెంట్ గా 80% రిమోట్ లిటిగేషన్ సర్వీసులు

యూఏఈ: న్యాయవ్యవస్థలో వేగవంతమైన సేవలు అందించే లక్ష్యంతో ఈ ఏడాది చివరి నాటికి రిమోట్ లిటిగేషన్ సేవలను మరింతగా విస్తృతం చేస్తోంది. 2021 చివరి నాటికి దాదాపు 80 శాతంపైగా రిమోట్ లిటిగేషన్ సెషన్స్ నిర్వహించేలా న్యాయవ్యవస్థను తీర్చిదిద్దనున్నట్లు యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వెల్లడించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఏర్పడిన సవాళ్లను అధిగమించి రిమోట్ లిటిగేషన్ విధానాన్ని అడాప్ట్ చేసుకోవటంలో యూఏఈ విజయవంతం అయ్యిందని తెలిపారు. అదే అనుభవంతో రానున్న రోజుల్లో అత్యంత సమర్ధవంతమైన, పారదర్శకమైన, వేగవంతమైన న్యాయ సేవలు అందించేలా రిమోట్ లిటిగేషన్ సర్వీసు దోహదపడేలా సిద్ధం అవుతున్నామని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com