'ఏం మాయ చేసావే కాంబినేషన్ లో మరో సినిమా..
- March 08, 2016'ఏం మాయ చేసావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ప్రేమజంట నాగచైతన్య, సమంతలు మరోసారి తెరను పంచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మూడు సినిమాల్లో కలిసి నటించిన ఈ హిట్ కపుల్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఏం మాయ చేసావే సినిమా తరువాత ఆటోనగర్ సూర్యలో కలిసి నటించారు చైతు, సామ్. ఈ సినిమా విజయం సాధించకపోయినా, ఈ ఇద్దరి కెమిస్ట్రీ మాత్రం బాగానే వర్క్ అవుట్ అయ్యింది.తరువాత మనం సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను నమోదు చేశారు. ఇటీవల సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ, రెండో ప్రయత్నంగా నాగచైతన్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకు సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతూ, ప్రస్తుతం ప్రేమమ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు, ఈ రెండు సినిమాల తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు